భారతదేశ ఆర్ధిక చరిత్రను ముఖ్యంగా మూడు కాలాలుగా విభజించవచ్చు, మొదటిగా 17వ శతాబ్దం వరకు వున్న వలసలకి ముందు కాలం. ఆంగ్లేయులు వలస పోయి వేరొక చోట స్థిర నివాసం ఎర్పరుచుకోవటం వలన వలసల కాలం 17వ శతాబ్దంలో మొదలయ్యి, 1947లో వచ్చిన స్వతంత్రంతో అంతం అయ్యింది. మూడవ కాలం 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి మొదలయ్యి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. భారత ఆర్ధిక వ్యవస్థ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ (PPP-పిపిపి) లెక్కల బట్టి 3.36 ట్రిలియన్ డాలర్ల GDP (జిడిపి అనగా ఆదాయం) తో ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. డాలర్ మారక ద్రవ్య విలువల బట్టి చూసినా, భారత్ 691.87 బిలియన్ డాలర్ల GDP తో ప్రపంచంలో పదవ స్థానంలో ఉంది. 2005 మొదటి త్రైమాసికం నాటికి భారత్ 8.1 శాతం పెరుగుదలతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఐతే, భారీ జనాభా వలన తలసరి ఆదాయం మాత్రం 3,100 డాలర్లతో (PPP లెక్కల బట్టి) కొంచెం తక్కువగానే ఉంది. భారత ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయం , హస్తకళలు , పరిశ్రమలు మరియు సేవలు వంటి రంగాలతో విభిన్నమై ఉన్నది. నేటి భారత ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు సేవల రంగమే దోహదపడుతున్నప్పటికీ, పని చేసే జనాభాలో మూడింట రెం
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH