Skip to main content

Posts

Showing posts with the label ఫిక్కీ

ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌కు ప్రోత్సాహం

త్వరలో నియంత్రణ చట్టాల్లో  మార్పులు: సిఎం చంద్రబాబు న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి):  ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎపి-తెలంగాణల్లో ప్రత్యక్ష అమ్మకాలపై రూపొందించిన నివేదికను సమర్పించేందుకు ఆంధ్రా భవన్‌లో తనను కలిసిన ఫిక్కీ ప్రతినిధి వర్గానికి సిఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించేందుకు నియంత్రణ వ్యవస్థల్లో సైతం మార్పులు చేస్తామన్నారు. ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్‌ డ్వాక్రా మహిళలకు ఉపయోగపడుతుందన్నారు. సరైన చర్యలు తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 నాటికి 8 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి కల్పించవచ్చని ఫిక్కీ ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రికి వివరించింది. దీని వలన ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపింది. ప్రత్యక్షంగా విక్రయించే ఉత్పత్తుల్లో 30 శాతం మాత్రమే దిగుమతి సరుకులని, మిగతా 70 శాతం ఉత్పత్తులు దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఉత్పత్తవుతున్నాయని వెల్లడించింది. చట్టాన్ని సవరించాలి: సేన్‌  ప్రత్యక్ష విక్రయాల ద్వారా మహిళా సాధికారత