Skip to main content

Posts

Showing posts with the label శ్రీసిటీ

టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ!

న్యూఢిల్లీ:  జపాన్‌లోని టొయోమా నగరంలోని వివిధ కట్టడాలు, పలు రంగాలకు చెందిన పరిశ్రమలను ఏపీలోనూ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం టొయోమా నగరానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల చంద్రబాబు జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఏపీ-టొయోమా సోదర రాష్ట్రాలుగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జపాన్‌ ప్రతినిధి బృందం చంద్రబాబుతో సమావేశమైంది. ఆ నగరంలో ఏమేమి ఉన్నాయో ఏపీలో వాటిని ఏర్పాటు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. అక్కడ ఏమేమి టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ! ఉన్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. టూరిజం, ఫార్మా సిటీలు, స్పెషల్‌ పర్పస్‌ మిషన్‌ల ఏర్పాటుకు వారు మొగ్గు చూపారు. వీటికి సంబంధించి జపాన్‌ బృందం గురువారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పర్యటిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి జపాన్‌ ప్రధానికి ఆ బృందం నివేదిక అందించనుంది. అనంతరం దీనిపై అక్కడి పార్లమెంటులో చర్చిస్తామని ఆ బృందం చంద్రబాబుకు తెలిపింది. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుసుకుంటామని హామీ