Skip to main content

Posts

Showing posts with the label పర్యాటక రంగం

ఒకేరోజు రూ.1240 కోట్ల ఒప్పందాలు

పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థల అంగీకారం చంద్రబాబు సమక్షంలో పత్రాల అందజేత ఆం ధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం పాజెక్టులకు సంబంధించి శనివారం ఒక్క రోజే రూ.1240 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేవారికి నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలను సకాలంలో అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్ద ఉన్న డ్యాష్‌ బోర్డులో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులపై ఆయా సంస్థల ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చందర్‌, పర్యాటక శాఖ కమిషనర్‌ రాజేంద్రప్రసాద్‌ ఖజూరియా, ఉప సంచాలకుడు ప్రసాద్‌, ఎస్కార్ట్‌ అధికారి వై.సత్యనారాయణ , ఈడీ అమరేంద్ర పాల్గొన్నారు. గత నెలలో రాష్ట్ర పర్యాటక వి