Skip to main content

Posts

Showing posts with the label భారతదేశం

భారత్‌-జర్మనీ సుదృఢ బంధం

భారత్‌లో సౌర విద్యుత్‌కు 100 కోట్ల యూరోలకు పైగా జర్మనీ సాయం ఇరు దేశాల మధ్య 18 ఒప్పందాలు మోదీ, మెర్కెల్‌ సుదీర్ఘ చర్చలు భారత్‌ను ఆర్థికంగా పరివర్తన చేయాలన్న మా సంకల్పానికి జర్మనీ సహజ భాగస్వామి అవుతుందనుకుంటున్నా. జర్మనీ సామర్థ్యాలు, భారత ప్రాధాన్యతలకు జోడీ కుదిరింది. ఆర్థిక సంబంధాల బలోపేతం పైనే మాదృష్టంతా. అంతులేని సవాళ్లు, విస్తృత అవకాశాలకు కొదవలేని ఈ రోజుల్లో... మరింత మానవీయ, శాంతియుత, సుస్థిర ప్రపంచ నిర్మాణంలో భారత్‌-జర్మనీలు సుదృఢ భాగస్వాములుగా ముందడుగు వేస్తాయని విశ్వసిస్తున్నా -నరేంద్ర మోదీ వివిధ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మోదీ వేగం అద్భుతం. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయి. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సౌరవిద్యుత్‌ రంగాలకు సంబంధించి ఇరు దేశాలూ అనేక నిర్ణయాలు తీసుకున్నాయి - ఏంజెలా మెర్కెల్‌ భారత్‌-జర్మనీ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. రక్షణ ఉత్పత్తులు, వాణిజ్యం, భద్రత, నిఘా, రైల్వేలు, పరిశుద్ధ ఇంధనం...లాంటి కీలక రంగాల్లో తమ మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా 18 అవగాహన ఒప్పందాల(ఎం

భారతదేశం అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకోగలదు

అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకోగలదు 2017-18 కల్లా 8 శాతానికి జీడీపీ ఎగుమతులు బలహీనంగా ఉన్నా సరే ఈ ఏడాది 7.5 శాతం వృద్ధిరేటు సాధిస్తుంది ప్రపంచ బ్యాంకు అంచనాలు (వాషింగ్టన్‌) అంతర్జాతీయ అనిశ్చితులను సమర్థంగా తట్టుకునే సత్తా భారత్‌కు ఉందని ప్రపంచ బ్యాంకు కితాబునిచ్చింది. సంస్కరణలను వేగవంతంగా అమలు చేయగల అవకాశాలు ఉండడం ఇందుకు కారణంగా చూపింది. ఎగుమతుల్లో వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతంగా నమోదుకాగలదని అంచనా వేసింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం భారతేనని ‘సౌత్‌ ఏషియా ఎకనామిక్‌ ఫోకస్‌ ఫాల్‌ 2015’ నివేదికలో వెల్లడించింది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే.. * 2017-18 కల్లా భారత్‌ 8 శాతం వృద్ధిని సాధిస్తుంది. * నిన్నమొన్నటి దాకా అత్యధిక వృద్ధితో ఉన్న చైనా క్రమంగా తక్కువ స్థాయి వృద్ధిలోకి జారిపోతున్న క్రమంలో భారత్‌.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. * పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల్లో మెరుగుదల కనిపిస్తుండడంతో.. భారత్‌ సరైన వృద్ధి బాటలో పయనిస్తోంది. * 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కాగా.. ప్రస్తుత ఆ

జర్మనీకి రెడ్‌ కార్పెట్‌

డిఐపిపిలో ప్రత్యేక వ్యవస్థ రైల్వే, ఏవియేషన్‌, రక్షణ విభాగాల్లో విస్తృత సహకారం  సోలార్‌ రంగానికి రూ.6,900 కోట్ల ప్రత్యేక నిధి  ఇయుతో ఎఫ్‌టిఎ పైనా చర్చలు పునరుద్ధరణ భారత్‌-జర్మనీ అధినేతల సంయుక్త ప్రకటన  న్యూఢిల్లీ :  భారత్‌లో జర్మనీ పెట్టుబడులకు సత్వర అనుమతులు మంజూరు చేసేందుకు ఉభయ దేశాల మధ్య అంగీకారం కుదిరింది. అలాగే భారత్‌లో సౌరవిద్యుత్‌రంగం అభివృద్ధి కోసం 100 కోట్ల యూరోల (6900 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందించేందుకు జర్మనీ అంగీకరించింది. ప్రస్తుతం గ్రీన్‌ కారిడార్‌కు అందిస్తున్న 100 కోట్ల యూరోల ఆర్థిక సహాయానికి ఇది అదనం. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రధాని నరేంద్రమోదీతో విస్తృత స్థాయి చర్చల అనంతరం ఉభయులు జారీ చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశాలు చోటు చేసుకున్నాయి. ఉభయ దేశాల మధ్య భిన్న రంగాల్లో సహకారంపై 13 ఒప్పందాలు కుదిరాయి. మోదీ, మెర్కెల్‌ మూడవ అంతర్‌ ప్రభుత్వ శిఖరాగ్ర స్థాయి సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటు వేరుగా కూడా మూడు గంటల పాటు భిన్న అంశాలపై చర్చలు జరిపారు. రైల్వే, ఏవియేషన్‌, రక్షణ, భద్రత, గూఢచర్యం, వాణిజ్