గుజరాత్ కు చెందిన సానిటరీ ఉత్పత్తుల తయారీ కంపెనీ సెరా సానిటరీవేర్ లిమిటెడ్ .. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంజనీ టైల్స్ తో కలిసి సిరామిక్ విట్రిఫైడ్ టైల్స్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది . దీన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో నెలకొల్పాలని కంపెనీలు నిర్ణయించాయి . ఈ ప్లాంట్ కు సంబంధించి రెండు కంపెనీలు ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయనున్నాయి . ఇందులో సెరాకు 51 శాతం , అంజనీ టైల్స్ కు 49 శాతం వాటా ఉంటుంది . 68 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్లాంట్ ను నిర్మించాలని కంపెనీలు భావిస్తున్నాయి . నిధులను రుణం , ఈక్విటీ ద్వారా సమీకరించనున్నారు . వచ్చే ఏడాదిలోనే ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీలు నిర్ణయించాయి . కాగా సెరా 18.36 కోట్ల రూపాయలు , అంజనీ 17.64 కోట్ల రూపాయలను ప్రారంభంలో ప్లాంట్ కోసం సమకూర్చనున్నాయి . ఈ ప్లాంట్ లో రోజుకు 10,000 చదరపు మీటర్ల సెరామిక్ టైల్స్ ను ఉత్పత్తి చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి . ఇదిలా ఉంటే .. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికానికి సెరా సా
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH