Skip to main content

Posts

Showing posts with the label స్మార్ట్‌సిటీ

మిస్టర్‌ ‘స్మార్ట్‌’లకు మైక్రోసాఫ్ట్‌ అండ

నూతన ఆవిష్కరణలకు టెక్నాలజీ మద్దతు  జస్ట్‌ డయల్‌, పేటిఎం,  స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం  ముంబై :  భారత స్మార్ట్‌సిటీలతో అనుసంధానమై ఉండి వాటి అభివద్ధికి పాటు పడాలన్న తపన గల వందలాది మంది ఔత్సాహిక పారిశ్రామికులకు ప్రాజెక్టుల అమలుకు కావలసిన ఆర్థిక, టెక్నాలజీ సహాయం సమకూర్చనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్ల చెప్పారు. ఇ కామర్స్‌తో సహా భిన్న విభాగాల్లో స్టార్ట్‌పల సంస్కృతి వేళ్లూనుకోవడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. ‘వేగవంతమైన భారత్‌-భవిష్య త్తు ఆవిష్కరణ’ అనే అంశంపై జరిగిన సదస్సులో కీలకోపన్యాసం ఇస్తూ జస్ట్‌ డయల్‌, పే టిఎం, స్నాప్‌డీల్‌ వంటి ఇ-కామ్‌ దిగ్గజాలతో మైక్రోసాఫ్ట్‌ కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకున్నదని ఆయన ప్రకటించారు. ఈ కొత్త భాగస్వామ్యాల కింద స్మార్ట్‌సిటీలతో అనుసంధానమై ఉన్న స్టార్ట్‌పలకు ప్రత్యేక క్లౌడ్‌ సదుపాయం అందిస్తుందని, తమ అగ్రగామి కంప్యూటింగ్‌ పరికరాలైన లూమియా 950, 950 ఎక్స్‌ఎల్‌, సర్ఫేస్‌ ప్రో 4 ఉత్పత్తులను కూ డా అందచేస్తుందని ఆయన చెప్పారు.  డిసెంబర్‌, జనవరి నెలల్లో ఆ ఉత్పత్తులను అందచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. 75 వేల రూపాయలు, అంతకన్నా పై ధరలో అందుబాటులో ఉంచనున్న