దేశంలోనే తొలిసారి రిటైల్ పాలసీ ప్రకటన రూ.38,500 కోట్లతో విశాఖ ఉక్కు విస్తరణ కృష్ణపట్నంలో 3 వేల కోట్లతో రీగ్యాసిఫికేషన్ ప్లాంట్ అమరావతిలో 800 కోట్లతో డబ్ల్యూటీసీ భారీ టవర్ ఐటీలో 3160 కోట్ల పెట్టుబడులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి 5892 కోట్లు అమరావతికీ పెట్టుబడుల ప్రవాహం 13,300 కోట్ల విలువైన ఎంవోయూలు హౌసింగ్లో హడ్కో 7500 కోట్లు ఆంధ్రాబ్యాంకు 5వేల కోట్లు రుణం విశాఖ సదస్సులో కొనసాగిన జోష్ విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రెండో రోజూ అదే జోష్.. నవ్యాంధ్రలో నూతన ఉత్తేజాన్ని నింపేలా పెట్టుబడుల వెల్లువ. తొలి రోజు మూడు రంగాలకే పరిమితమైన పెట్టుబడుల హామీలు రెండో రోజు అనేక రంగాలకూ విస్తరించాయి. ‘బ్రాండ్ హైదరాబాద్’ తెలంగాణకు పరిమితమైనా ‘బ్రాండ్ చంద్రబాబు’పై పెట్టుబడిదారులు విశ్వాసం ఉంచారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 282 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ ఎంవోయూలు అమలైతే 8 లక్షల మంది నిరుద్యోగ యువత మోములపై చిరునవ్వులు విరబూయనున్నాయి. ఊహించినదాని కన్నా స్పందన అనూహ్యంగా ఉండటంతో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. స్వయంగా అన్ని ఒప్పందాలను తన
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH