ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లలో అమ్మకాలు విశాఖ, విజయవాడల్లో గోదాంలు డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వెయ్యి రకాల వస్తువులను డిజిటల్ మార్కెట్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ విక్రయానికి ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ కంపెనీలతో సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు చర్చిస్తున్నారు. నగర ప్రాంతాల్లో డిమాండ్ ఉండడంతోపాటు పంపిణీ తేలిగ్గా ఉంటుందని భావించి విశాఖపట్నం, విజయవాడలతో మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఫ్లిప్కార్ట్ ఇప్పటికే సెర్ప్తో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సంఘాలు తయారుచేస్తున్న దుస్తులు, అపెరల్స్, ఇంటి అలంకరణ వస్తువులను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. డ్వాక్రా ఉత్పత్తుల క్యాటలాగ్ ఫోటోలకు కూడా సదరు కంపెనీనే తుది మెరుగులు దిద్దుతోంది. ఆర్డర్ రాగానే పంపిణీ...ఫ్లిప్కార్ట్తో శిక్షణ ఆన్లైన్లో మార్కెటింగ్ అంటే... ఎవరైనా కొనుగోలుకు ఆర్డర్ పెట్టిన తర్వాత వీలైనంత తొందర్లో ఆ వస్తువును చేర్చాల్సి ఉంటుంది. వస్తువు ప్యాకింగ్ కూడా రవాణాకు అనుగుణంగా ఉండాలి. ప్యాకింగ్, పంపిణీలపై డ్వాక్రా మహిళలకు ఫ్లిప్కార్ట్ సిబ్
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH