ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... 2018 కల్లా రాష్ట్రంలో 10వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమని తెలిపారు. సౌర, పవన విద్యుత్ రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని... సౌర, పవన విద్యుత్ ఒకే ప్రాంతంలో ఉత్పత్తయ్యేలా పరిజ్ఞానం రూపొందించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో ఎనన్జీ యూనివర్శిటీ ఏర్పాటుకు సుజలాన్, హీరో కంపెనీలు రూ.50కోట్లు విరాళం ఇచ్చాయి.
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH