లాజిస్టిక్ హబ్, ఇండియా గేట్వేగా ఆంధ్రా.....గుంటూరులో ప్రాపర్టీ షోలో సిఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడిక్కడ అప్రెడా ప్రాపర్టీ షోను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్, ఇండియా గేట్వేగా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని అమరావతిని బ్లూ, గ్రీన్ రాజధానిగా అభివృద్ధి చేయటమే కాకుండా ఒక ప్రాంతాన్ని అప్రెడాకు కేటాయించి వారి ద్వారా నిర్మాణ పనులు చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర విభజన అన్యాయంగా, ఏక పక్షంగా జరిగిందని, అయినా మానసికంగా ఆందోళనకు గురి కాలేదన్నారు. సంక్షోభాలు వస్తుంటాయి, పోతుంటాయని వాటిని అవకాశంగా తీసుకొని సమర్థవంతంగా ఎదగాలన్నారు. 15 నెలల్లోనే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో తాగు, సాగునీరు అందిస్తామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో పరిశ్రమల నిర్వహణకు ఆంధ్రా రెండో స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. సింగపూర్లోని లీక్వాతో ఎంవోయూ చేసుకున్నామని, ప్రపంచంలోనే ఐదు ఉన్నత దేశాల స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందన్నారు. 2
PRINT & PACKAGING | DIGITAL MEDIA | BRANDING | RESEARCH